
ఎపిటిఎఫ్ జిల్లా ముఖ్యకార్యకర్తల సమావేశం కడప ఎపిటిఎఫ్ కార్యాలయం లో జరిగింది.ఈ సందర్భంగా ఎపిటిఎఫ్ జిల్లాప్రధానకార్యదర్శి సివిప్రసాద్ మాట్లాడుతూ ఉపాధ్యాయ సమష్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేసారు. ప్రతి నెలా వేతనాలు ఒకటో తేదీనే చెల్లించాలని డిమాండ్ చేసారు.010 పద్దు కింద జీతాలన్న ఉపయోగం లేకుండా పోయిందన్నారు. వర్క్ అడ్ జెస్ట్ మెంట్ తో సంబంధం లేకుండా పదోన్నతి ఉపాధ్యాయులందరికి పే ఫిక్షేషన్ కు అనుమతి ఇచ్చి ప్లేస్ మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేసారు. పి.ఆర్.సి, డి.ఎ బకాయిలను వెంటనే ఉపాధ్యాయుల ఖాతాల్లో జమ చేయాలన్నారు. బోధనేతర పనులన్ని ఉపాధ్యాయులకు బాన్ చేయకుండా జనగణన,ఎన్నికల విధులనుండి తప్పించటం శోచినియం అన్నారు.నాడు-నేడు విధులు నుండి ఉపాధ్యాయులను తప్పించాలని డిమాండ్ చేసారు. జిల్లా అషొషియేట్ అధ్యక్షులు ఈశ్వరచంద్ర మాట్లాడుతూ బదిలీలు,నియామకాలు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేసారు. నిర్మాణాత్మక పరీక్షలు నిర్వహణలో ఉన్న లోపాలను సవరించాలని డిమాండ్ చేసారు.బ్లూ ఫ్రింట్ ప్రకారం ఉపాధ్యాయులే ప్రశ్నాపత్రాలు తయారు చేసుకొనే అవకాశం కల్పించాలని డిమాండ్ చేసారు. ఎకోపాధ్యాయ పాఠశాలలన్నింటికీ రెండో పోస్టును భర్తీ చేయాలని కోరారు. కార్యక్రమం లో ఎపిటిఎఫ్ నాయకులు వెంకటసుబ్బయ్య,ఉమాకాంత్,నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.