ఏపీలో
పదోతరగతి పరీక్షల తేదీలు వెల్లడయ్యాయి. అమరావతిలో మంత్రి ఘంటా శ్రీనివాసరావు
సోమవారం (డిసెంబరు 3) పరీక్షల టైమ్ టేబుల్ను
విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. షెడ్యూలు ప్రకారం మార్చి 18 నుంచి 29 వరకు పదోతరగతి పరీక్షలునిర్వహించనున్నట్లు తెలిపారు. ఆయా తేదీల్లో ఉదయం 9.00 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు
పరీక్షలు నిర్వహిస్తామన్నారు. పరీక్షల కోసం దరఖాస్తు చేసుకోవడానికి డిసెంబరు 7 వరకు అవకాశం ఉంది. దరఖాస్తు చేసుకోనివారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని
మంత్రి సూచించారు.
పరీక్షల కోసం ఇప్పటి వరకు మొత్తం 6.10
లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని.. 2,833 కేంద్రాల్లో
పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి గంటా తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 91 సమస్యాత్మక పరీక్ష కేంద్రాలు గుర్తించామని, ఆయా
కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామని స్పష్టంచేశారు. పరీక్షలకు
సంబంధించిన హాల్టికెట్లను ప్రధానోపాధ్యాయులు వెబ్సైట్ నుంచి డౌన్లోడ్
చేసుకోవాలని సూచించారు. పరీక్షలు జరిగిన నెల రోజులకే ఫలితాలను విడుదల చేయనున్నట్లు
మంత్రి తెలిపారు.
పరీక్షల
షెడ్యూలు..