ఆంధ్రప్రదేశ్ విద్యాపరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో కర్నూల్ జిల్లా కలెక్టరేట్ ఎదుట జరిగిన నిరసన కార్యక్రమంలో ప్రసంగిస్తున్న APTF రాష్ట్ర అధ్యక్షుడు హృదయ రాజు,
నేడు (12.8.21) ఆంధ్రప్రదేశ్ విద్యాపరిరక్షణ (APSEC) కమిటీ & అఖిల భారత విద్యా హక్కు వేదిక (AIFRTE) ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా కలెక్టరేట్ ఎదుట జరిగిన నిరసన దీక్షలో ముఖ్య అతిథిగా పాల్గొన్న APTF రాష్ట్ర అధ్యక్షులు & ఏపిసెక్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జి.హృదయరాజు మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏపి లో ప్రాథమిక తరగతులు 3,4,5 లను దూరంలో ఉన్న ఉన్నత పాఠశాలలకు తరలించడాన్ని మానుకొని ప్రాథమిక విద్యను అన్ని రకాలుగా బలోపేతం చేయాలని... ఒరియా, తమిళ్, కన్నడ, ఉర్దూ, హిందీ తదితర భాషలను దృష్టిలో పెట్టుకొని పాఠశాలల్లో పారాలాల్ మీడియం లను కొనసాగించాలని, ఇప్పటికే ఉన్న ఖాళీలు, పెరిగిన విద్యార్థుల ఎన్రోల్మెంట్ ను దృష్టిలో పెట్టుకొని 30 వేల కొత్త టీచర్ పోస్టులను భర్తీ చేయుటకు నూతన DSC నోటిఫికేషన్ ను జారీ చేయాలని డిమాండ్ చేశారు.
జి.తిమ్మప్ప ఏపిసెక్ జిల్లా కన్వీనర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో APTF జిల్లా గౌరవాధ్యక్షులు కమలాకర రావు ,జిల్లా ప్రధానకార్యదర్శి ఇస్మాయిల్, APTF నాయకులు రామకృష్ణ,మరియానందం, శేషయ్య, రాంభూపాల్ రెడ్డి,రాఘవరెడ్డి, నరేంద్ర, శ్రీనివాసరెడ్డి,DTF రాష్ట్ర నాయకులు రత్నం యోసేపు, మద్దయ్య, PDSU భాస్కర్, PDSU రాజేష్, IFTU వెంకటేశ్వర్లు మాట్లాడారు. ఏపి సెక్ భాగస్వామ్య సంఘాల కార్యకర్తలు పాల్గొన్నారు.