నెల్లూరు నగరంలో గాంధీ బొమ్మ వద్ద APSEC ,నెల్లూరు ఆధ్వర్యంలో నిర్వహించిన బ్యానర్ ప్రదర్శన కార్యక్రమం
పై కార్యక్రమంలో పాల్గొన్న APTF,DTF, PDSU,AISF, PDSU కార్య కర్తలు కు ధన్యవాదాలు APSEC,Nellore
------------------------------------------
ఆంధ్రప్రదేశ్ విద్యాపరిరక్షణ కమిటీ పిలుపు మేరకు అనంతపురము జిల్లా విద్యాపరిరక్షణకమిటీ,ఎపిటిఎఫ్1938,డి టి ఎఫ్ ,పి డి యస్ యు,ఏ ఐ యస్ ఎఫ్,పిడియస్ యు,సమ్యుక్త భాగస్వామ్యంలో స్థానిక్ టవర్ క్లాక్ గాంధీ విగ్రహం ముందు ప్రజా వ్యతిరేక నూతన జాతీయ విద్యావిధానం అమలును నిరసిస్తూ బ్యానర్ ప్రదర్శన జరిపారు.ఈ కార్యక్రమానికి ఎపిటిఎఫ్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి కులశేఖరరెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు.ఈ సంధర్భంగా వారు మాట్లాడుతూ ...
1)ప్రజా వ్యతిరేక నూతన విద్యావిధానాన్ని రాష్ట్రంలో అమలు చేయరాదు.
2)రాష్ట్రంలో కాళీగా వున్న 23000 ఉపాద్యాయ ఖాళీలు భర్తీ చేయాలి.
3)ప్రాథమిక పాఠశాలల విభజన ఆపేయాలి. తదితర డిమాడ్లు నినదించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ విద్యా పరిరక్షణ కమిటీ అనంతపురం జిల్లా కన్వీనర్ జి.రవీంద్ర నాయకులు విశ్వనాధరెడ్డి,వెంకటరెడ్డి,వెంకటసుబ్బయ్య,పి.వ ప్రసాద్, శ్రీనివాసనాయక్,గంగిరెడ్డి,ఆంజనేయులు నాయక్,నరసింహులు ,అంకిరెడ్డి,వజీర్,ఆదినారాయణ, పిడుగు శ్రీనివాసులు,నారాయణరెడ్డి, లక్ష్మి నారాయణ ,నాగసైనారెడ్డి, ఫక్రుద్దీన్, రమేష్ రెడ్డి, గోవిందరెడ్డి, రాజ మోహన్ డిటి ఎఫ్ నాయకులు జార్జి,చలివేముల బాబు,పురుశోత్తం,ఫిడి యస్ యు నాయకులు వీరేంద్ర,శంకర్ ఏ ఐ యస్ ఎఫ్ నాయకులు మనోహర్,ఆనంద్ పాల్గొన్నారు
----------------------------------------------------------------------------
ఈ రోజు అనగా 02-10-2021గాంధీజయంతి రోజు ఆంధ్రప్రదేశ్ విద్యా పరిరక్షణ సమితి పిలుపు మేరకు గిద్దలూరు గాంధీ బొమ్మ కూడలిలో ఏ. పి . టి. ఎఫ్. 1938 రాష్ట్ర కార్యదర్శి యల్లా. శ్రీనివాసులు ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం నకు విజ్ఞాపన పత్రం ఇవ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఎన్. ఇ. పి. 2020 విద్యా విధానం అమలు చేయరాదని, 23వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని, ప్రాథమిక పాఠశాలలు విడదీయరాదని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఏపిటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి యల్లా శ్రీనివాసులు, జిల్లా ఉపాధ్యక్షుడు యస్ హెచ్ కబీర్, జిల్లా కార్యదర్శి డి. వెంకటేశ్వర్లు, మండల నాయకులు వి. రవిశంకర్ డి. వి. పిచ్చయ్య, జి. పాండు, టి. పాండు రంగస్వామి, యం. వి. రమేష్ తదితరులు పాల్గొని ప్రసంగించారు.