సిపిఎస్ రద్దు చేయాల్సిందే!-
ధర్నాలో ఏపీటీఎఫ్ డిమాండ్
- ఏకోపాధ్యాయ పాఠశాలలకు రెండో టీచర్ ను నియమించడం,
- 3,4,5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో కలపరాదని,
- యాప్స్ భారం
తగ్గించాలని,
- డీఈఓ
పూల్ పండితులకు శాశ్వత స్థానాలు కేటాయించాలని కోరుతూ నెల్లూరు డీఈఓ కార్యాలయం ఎదుట
ఏపీటీఎఫ్ చేపట్టిన ధర్నా విజయవంతమైంది. జిల్లా నలుమూలల నుంచి వందలాది ఉపాధ్యాయులు
ధర్నాకు కదిలివచ్చారు.
- ఎన్నికల హామీల్లో
భాగంగా ఇచ్చిన సిపిఎస్ రద్దు చేయాలని,
- పెండింగ్ లో ఉన్న
కరువు భత్యం బకాయిలు మంజూరు చేయాలని,
- పీఆర్సీ అమలుచేయాలని
ధర్నా సందర్భంగా డిమాండ్లకు చేశారు,
- 2008 డీఎస్సీ
ఉపాధ్యాయులకు తక్షణమే వేతనాలు చెల్లించాలని, వారికి
చట్టబద్ధంగా రెగ్యులర్ వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
- ఎయిడెడ్ పాఠశాలల
మెర్జింగ్ ను నిలుపుదలచేసి వాటిని బలోపేతం చేయాలని,
- మునిసిపల్
పాఠశాలల్లో ఉపాధ్యాయులకు బదిలీలు నిర్వహించడంతో పాటు పదోన్నతులు చేపట్టాలని
ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
- నెల్లూరు డీఈఓ కార్యాలయంలో అవినీతిని ఎండగట్టారు.
ఉపాధ్యాయుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ధర్నా శిబిరంకు వచ్చిన డీఈఓ ను
కోరారు. ఒకవైపు వర్షం, ఎన్నికల కోడ్ నేపద్యంలో మరోవైపు ధర్నా
నిర్వహిణను అడ్డుకొంటూ పోలీసుల వత్తిడి మధ్య ధర్నా ఉద్విఘ్నభరితంగా సాగింది.
పోలీసులు ధర్నాను అడ్డుకున్నప్పటికీ కార్యాలయ ఆవరణలో ధర్నాను కొనసాగించారు. ధర్నాకు జిల్లా అధ్యక్షులు సురేంద్ర రెడ్డి
అధ్యక్షత వహించగా, ఐఫియా జాతీయ ఉపాధ్యక్షులు సుబ్బారెడ్డి,
రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరరావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు మోహన్ దాస్, రాష్ట్ర
కార్యదర్శి చిరంజీవి, జిల్లా ప్రధాన కార్యదర్శి పిచ్చిబాబు,
రాష్ట్ర కౌన్సిలర్ హజరత్తయ్య అసోసియేట్ అధ్యక్షుడు రియాజ్, ఎన్జీఓ నాయకులు పెంచలరావు, వెంకటస్వామి నాయుడు
ప్రసంగించారు. మహిళలు పెద్దయెత్తున తరలిరాగా,
పొదలకూరు కార్యకర్త జ్యోతి ఉద్యమ గీతాలు ఆలపించారు.