రాష్ట్రంలోని న్యాయమైన ఉపాధ్యాయ, ఉద్యోగులు, కార్మిక,పెన్షనర్ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఏపీ జెఏసి సెక్రెటరీ జనరల్ & APTF రాష్ట్ర అధ్యక్షులు జి.హృదయ రాజు అన్నారు. APJAC & APJAC అమరావతి ఐక్యవేదిక ఇచ్చిన కార్యాచరణ పిలుపు మేరకు రెండవ రోజు కర్నూలు పట్టణంలోని మార్కెట్ వద్దగల ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల లో భోధన మరియు బోధనేతర సిబ్బంది నల్లబ్యాడ్జీలు ధరించి తమ నిరసన తెల్పారు.ఈ సందర్భంగా హృదయ రాజు మాట్లాడుతూ 13 లక్షల మంది
ఉపాధ్యాయ, ఉద్యోగ, కార్మిక,పెన్షనర్లకు సంబందించిన 71 సమస్యలపై డిసెంబర్ 1న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారికి నోటీసు సమర్పించి ఉద్యమంలోకి వచ్చామని, అయినా ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన లేకపోవడం గర్హనీయమని అన్నారు.
PRC నివేదిక పబ్లిక్ డొమైన్ లో వుంచి సంఘాలతో చర్చించి 55% ఫిట్మెంట్ తో అమలు చేయాలని, CPS ను రద్దు చేయాలని, 7 DA లను మంజూరు చేయాలని, కాంట్రాక్ట్ & సచివాలయ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలను పెంచాలని, కారుణ్య నియామకాలను వెంటనే చేపట్టాలని, మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్స్ గడువు పెంచాలని, విద్యారంగ, వైద్య విభాగంలోని సమస్యలను మరియు వివిధ శాఖలలో వున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని అన్నారు.
ఈ నిరసన కార్యక్రమంలో APTF జిల్లా గౌరవ అధ్యక్షులు ఏ.కమలాకర రావు, రాష్ట్ర కౌన్సిలర్స్ కె.మద్దిలేటి, నాగేశ్వర రావు, దాదాపీర్ జూనియర్ అసిస్టెంట్ ల సంఘం నాయకులు అన్వర్ , పాఠశాలలోని మహిళా టీచర్స్ పాల్గొన్నారు.
నిరసన కార్యక్రమంలో మాట్లాడుతున్న జి.హృదయ రాజు