మేధావులు ప్రాతినిధ్యం వహించే పెద్దల సభ ఎన్నికలకు అనర్హులను ఓటర్లుగా చేర్పించడం అనైతికమని కడపలో జరిగిన విలేకర్ల సమావేశంలో ఏపిటిఎఫ్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి యస్.చిరంజీవి అన్నారు
అర్హులను చేర్చడానికి సవాలక్ష అడ్డంకులు చెపుతూ అనర్హులను మాత్రం దొడ్డిదారిన ఓటర్లుగా చేర్పిస్తున్నారని వెంటనే బోగస్ ఓట్లను తొలగించాలని డిమాండ్ చేశారు.కార్పొరేట్ పాఠశాలల ఉపాద్యాయులకు జి.ఓ (1) ప్రకారం వేతనాలు అమలుచేయాలని ,తదుపరి ఓటర్లుగా కూడా అర్హత సాధిస్తారని,కార్పోరేట్ యాజమాన్యం జీతాలలో ప్రామాణికాలు పాటించకుండా ఓట్లు కోసం మాత్రమే వారి సంస్థలో పనిచేసే వారిని వాడుకొంటుందని విమర్శించారు.బడ్జెట్ స్కూళ్ళపై ప్రభుత్వ నిర్భందం తొలగించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఐఫియా జాతీయ ఉపాధ్యక్షులు కె.సుబ్బారెడ్డి, రాష్ట్రీయ పండిత పరిషత్ రాష్ట్ర అదనపు కార్యదర్శి బి.శివారెడ్డి, జిల్లా నాయకులు ఎఫ్.ఎం.ఎస్ ఖాదర్,ఎ.నరసింహారెడ్డి పాల్గొన్నారు