రేషనలైజేషన్కు గురయ్యే టీచర్లలో సీనియర్లకు అదనపు పాయింట్లు ఉండవని పాఠశాల విద్యాశాఖ స్పష్టంచేసింది . సోమవారం ఆ శాఖ అధికారులు నిర్వహించిన వెబైక్స్ సమావేశంలో ఈమేరకు వివరణ ఇచ్చారు . ఒక స్టేషన్లో ఎనిమిదేళ్లు పూర్తికాని టీచర్లు రేషనలైజేషన్కు ప్రభావితం అవుతుంటే వారికే అదనపు పాయింట్లు వస్తాయని పేర్కొన్నారు . ఒకవేళ ఇప్పటికే సీనియర్లు రేషనలైజేషన్కు దరఖాస్తు చేసి ఉంటే , వారి స్థానంలో జూనియ ర్లకు అవకాశం ఇవ్వాలన్నారు . అలాగే 40 శాతం కంటే ఎక్కువ దృష్టిలోపం ఉన్నవా రికి , 80 శాతం కంటే ఎక్కువ ఆర్థో వైకల్యం ఉన్నవారికి బదిలీల నుంచి మినహాయిం పునిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ ఓ ఉత్తర్వులో తెలిపింది . 2021 లో పదోన్నతి పొందిన ప్రధానోపాధ్యాయులు , టీచర్లు కచ్చితంగా బదిలీకి దరఖాస్తు చేసుకోవాలని స్పష్టంచేసింది