- .మిత్రులారా!జాతీయ విద్యా విధానం 2020 పైన ప్రభుత్వ స్థాయిలో జరిగిన సమావేశానికి ప్రభుత్వ సలహాదారు శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు, మరియు విద్యా శాఖ మాత్యులు శ్రీ ఆదిమూలపు సురేష్ గారు, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ బి రాజశేఖర్, IAS గారు డైరెక్టర్ వీరభద్రుడు IASగారు, సమగ్ర శిక్షా అభియాన్ డైరెక్టర్ శ్రీమతి వెట్రి సెల్వి, IAS గారు ఇతర అ ఉన్నతాధికారులు పాల్గొన్నారు ఈ సమావేశంలో పాల్గొన్న దాదాపు నలభై ఐదు సంఘాలు మన అభిప్రాయాన్ని సమర్థించాయి.
- మనం ప్రీ ప్రైమరీ పాఠశాలను ప్రైమరీకి అనుసందించాలని,
- 3, 4, 5 తరగతుల తరలింపును ఆపాలని,
- ప్రతి ప్రాథమిక పాఠశాలకు PSHM పోస్టులు మంజూరు చేయాలని ,
- 8వ తరగతి వరకు అన్ని యాజమాన్యాలలో మాతృభాషలో బోధన జరగాలని, ఉన్నత పాఠశాలలో సమాంతర మాధ్యమం కొనసాగాలని,
- ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి. 1 :20 ఉండాలని,
- ప్రస్తుతం ఖాళీగా ఉన్న 26 వేల పోస్టులు భర్తీ చేయాలని,
- సేవా సంస్థల ముసుగులో ప్రైవేటు వ్యక్తుల వ్యాపారాన్ని నిరోధించాలని
- ప్రతి మండలంలో ఎక్కువ నమోదు కలిగిన రెండు ఉన్నత పాఠశాలలో ప్లస్ టు ప్రారంభించాలని, అందులో జూనియర్ లెక్చరర్లుగా అర్హులైన ఉపద్యాయులను ప్రమోషన్ ద్వారా నియమించాలని,
- విద్యా వ్యాపారాన్ని అరికట్టాలని కోరడం జరిగింది.
- ప్రభుత్వ సలహాదారు మన సూచనలను తన డైరీ నందు నమోదు చేసుకొని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుని వెళ్తానని చెప్పడం జరిగింది.
- అలాగే డైరెక్టర్ గారు మాట్లాడుతూ సర్కులర్ 172 ద్వారా సమాచారాన్ని సేకరించేందుకు ఇచ్చామని అది ఉత్తర్వు కాదని ఆందోళన చెందవలసిన అవసరం లేదని ఏదైనా నిర్ణయం జరిగినప్పుడు మాత్రమే మీ అధిష్టానానికి వ్యతిరేకంగా ఉన్నచో పత్రికలకు ప్రకటనలు ఇవ్వాలని అలా కాక ఎడాపెడా ప్రకటనలు ఇస్తే డిపార్ట్మెంట్ కొంత ఇబ్బంది పడుతుందని అందులో మీరు మేము భాగస్వాములని ఇకపైన మీకు మాకు మధ్య నమ్మకంతో ముందుకు సాగాలని కోరారు.
- ప్రభుత్వ సలహాదారు ఫ్యాప్టో నాయకత్వానికి ఇచ్చిన మెమోలు ఉపసంహరించుకునేలా చేస్తామని హామీ ఇచ్చారు.
జి. హృదయ రాజు, అధ్యక్షులు
కె. వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి,
ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్