ప్రాథమికవిద్యను సర్వనాశనం చేస్తున్న 172 సర్క్యులరును రద్దుచేసి ప్రాథమిక తరగతులను యధావిధిగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ విద్యాపరిరక్షణ కమిటీ పిలుపు మేరకు కర్నూలు జిల్లా విద్యా శాఖ అధికారికి, జిల్లా రెవిన్యూ అధికారికి వినతిపత్రం సమర్పించడం జరిగింది. ఈకార్యక్రమములో కర్నూల్ జిల్లా కన్వీనర్ గట్టుతిమ్మప్ప, కొకన్వీనర్ ఇస్మాయిల్, ఎపిటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జి.హృదయరాజు, జిల్లాప్రధానకార్యదర్శి మాధవస్వామి, డిటీఎఫ్ రాష్ట్ర బాధ్యులు రత్నం ఏసేపు, పత్రిక సంపాదకులు కిషోర్, పిడిఎస్ యూ రాష్ట్ర కార్యదర్శి భాస్కర్,APTF నాయకులు గఫార్,జి. శ్రీనివాసరెడ్డి, హబీబుల్ల, యస్.శ్రీనివాస రెడ్డి లు పాల్గొన్నారు