APTF(1938) THERLAM/VZM



ఈరోజు(23.09.2021) తెర్లాం మండల శాఖ ఆధ్వర్యంలో మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు టి వి రమణ, డి సింహాచలం గార్ల ఆధ్వర్యంలో తెర్లాం మండలం లో గల 12 పాఠశాలలో సభ్యత్వ, జనరల్ ఫండ్, ఉపాధ్యాయ ప్రగతి క్యాంపైన్ నిర్వహించడం జరిగింది. కొత్తగా ఏర్పాటు అయిన మండల శాఖ అయినప్పటికీ కూడా ఈ కార్యక్రమం ను చాలా చక్కగా నిర్వహించినది ఉపాధ్యాయులు కూడా చక్కగా ప్రతిస్పందించారు. కొత్తగా ఏర్పాటు అయిన మండల శాఖ వద్ద ఈ రకమైన పరిస్థితి ఉంటే ఎన్నో సంవత్సరాల నుండి కార్యకలాపాలు నిర్వహిస్తున్న మండల శాఖల ఉపాధ్యాయులు ఎంత చక్కగా స్పందిస్తారో ఊహించ వచ్చును. కావున మనం పాఠశాలలకు వెళ్ళటమే ఆలస్యం ఉపాధ్యాయుల నుండి అద్భుతమైన స్పందన లభిస్తున్నది కావున ప్రతి ఒక్క మండల శాఖ రేపటి నుండే క్యాంపైన్ నిమిత్తం కదలాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గంట. సత్యనారాయణ గారు, జిల్లా మాజీ సహాధ్యక్షులు పి వి రాజశేఖర రావు గారు, జిల్లా గౌరవ అధ్యక్షులు ఎం బలరాం నాయుడు గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి పువ్వల ధనంజయ రావు గారు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న కార్యకర్తలకు, చక్కని సహకారం అందించిన తెర్లాం మండల ఉపాధ్యాయులకు ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (1938) తెర్లాం మండల శాఖ మరియు జిల్లా శాఖల పక్షాన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ఉద్యమాభి వందనాలు తెలియజేసుకుంటున్నాము.