APTF:1938 INFO
మున్సిపల్ టీచర్ల సమస్యలు & నూతన విద్యా విధానంపై మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారిని కలసిన APTF ప్రతినిధులు
మున్సిపల్ టీచర్ల ప్రధాన సమస్యలైన పదోన్నతులు, బదిలీలు,GPF తదితర సౌకర్యాలపై మంత్రి బొత్స సత్యనారాయణ గారితో సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. పదోన్నతుల ఫైల్ మంత్రి వద్ద వుందని తెల్పగా త్వరలో ఆమోదం తెల్పుతామని చెప్పారు. మిగతా సమస్యలను కూడా అధికార్లతో మాట్లాడి పరిష్కరిస్తామని అన్నారు.
రాష్ట్రంలో (NEP ) ప్రాథమిక 3,4,5 తరగతులను దూర ప్రాంతాలలోని హైస్కూల్లో కలపడం వల్ల అటు అర్బన్ మరియు గ్రామీణ ప్రాంతాలకు చెందిన పేద విద్యార్థుల్లో డ్రాపౌట్ ల శాతం అధికంగా ఉంటుందని APTF నాయకులు వివరించారు. దీనిపై రెండ్రోజుల్లో సమావేశం కానున్నామని , పరిశీలిస్తామని మంత్రి చెప్పారు.
అదేవిధంగా మున్సిపల్ టీచర్ల సమస్యలపై ఉపాధ్యాయ సంఘాలతో ప్రత్యేక సమావేశం నిర్వహించాలని కోరగా సానుకూలంగా స్పందించి అధికార్లతో సమావేశం పాటిస్తామని మంత్రి గారు తెల్పారు.
గౌ.మంత్రి గారిని కలసిన వారిలో APTF రాష్ట్ర అధ్యక్షులు జి.హృదయ రాజు, తాజా - మాజీ ప్రధాన కార్యదర్శులు కె.కులశేఖర రెడ్డి - కె.వెంకటేశ్వర రావు, రాష్ట్ర కార్యదర్శి కె.వెంకట్ రెడ్డి, అనంతపురం జిల్లా అధ్యక్షులు ఏ.విశ్వనాథ రెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు.
- Pr & GS APTF