రాష్ట్రంలోని జూనియర్ కళాశాలల గుర్తింపు రెన్యువల్, అదననపు తరగతి గదుల అనుమతికి సంబంధించిన దరఖాస్తుల గడువును ఇంటర్మీడియట్ బోర్డు పొడిగించింది. ఈ మేరకు బోర్డు కార్యదర్శి ఎంవి శేషగిరి బాబు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. 2023-24 విద్యాసంవత్సరానికి జూనియర్ కళాశాలల రెన్యువల్, అదనపు తరగతుల అనుమతులు సంబంధించిన దరఖాస్తులను ఈ నెల 10వ తేది వరకు స్వీకరిస్తామని పేర్కొన్నారు. అఫిలియేషన్ ఫీజు చెల్లింపు తేదీని కూడా ఈ నెల 4వ తేది వరకు పొడిగించిన్నట్లు తెలిపారు