ఫ్రెండ్స్
ఈ రోజు కమీషనర్ కార్యాలయంలో జాయింట్ డైరెక్టర్ శ్రీ జె డి ప్రతాపరెడ్డి గారి ఆధ్వర్యంలోఉదయం ఉపాధ్యాయ సంఘాల తో సమావేశం జరిగింది. APTF ప్రధాన కార్యదర్శి కె.వెంకటేశ్వర రావు పాల్గొన్నారు. ఈ సమావేశంలో రెండు అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చాయి
1.వచ్చే నెలలో బౌతికంగా తరగతులు నిర్వహించే అవకాశం లేదు. కావున 1జులై నుంచి ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తారు. మరి ఎలాచేద్దాము అని అడిగారు ఎక్కువ మంది సభ్యులు
1. వచ్చే నెల అంతా1నుంచి8 వరకు తరగతుల నిర్వహణ వద్దని,9,10 తరగతులకు వారానికి ఒక్కసారి టీచర్లు అందరూ వచ్చి అప్పటికి సప్తగిరి ఛానల్ ద్వారా జరిగిన అంశాలపై ఒక ప్రశ్నవళి తయారు చేసి సచివాలయం నందలి ఎదుకేషనల్ అసిస్టెంట్ ద్వారా పిల్లలకు చేర్చి తరువాతి వారంలో ఉపాధ్యాయులకు చేర్చే విదంగా ఉంటే బావుంటుందని ఒక వారం నమోదు మరియు వదిలిన వారి రికార్డ్ అప్డేట్ చేసుకొనుటకు వదలాలనికోరారు .
మనం పాండమిక్ దృష్ట్యా ప్రతిరోజు ఇద్దరు మాత్రమే హాజరైతే అలా ఇద్దరూ వారానికి ఒక్కరోజు రివ్యూచేస్తే బావుంటుందని సూచించాము.
2. ఉమ్మడి సర్వీసు నిబంధనలు తీసుకొని రావడం సాధ్యం కాదని,కావున 49 ఉపవిద్యా శాఖాధికారుల పోస్టులు,666 ఎం ఈ ఓ పోస్టులు , 13 డి ఇవో పోస్టులు క్రియేట్ చేసిజెడ్ పి వారికి100%ప్రమోషన్లు ఇచ్చేదానికి13 జెడ్ పి డివై డి ఈ ఓ పోస్టులు నాన్ టీచింగ్ వారికి ఇచ్చేదమని మన అభిప్రాయం అడిగారు
దీనిలో కొంత మనం ఆలోచించాలి
1.గత దశాబ్దాల ఉమ్మడి నిబంధనలు వదలి వేయాలి
2.ప్రభుత్వం తో సమానంగా జెడ్ పి పోస్టులు క్రియేట్ చేయబడతాయి
ఇందులో మీ ఆలోచనలు అభిప్రాయలు అవసరం. టెక్స్ట్ బుక్స్ వెంటనే పిపిణీ చేయాలని కోరడం జరిగింది.
- Pr & GS APTF
SCERT డైరెక్టర్ గారికి ప్రాతినిధ్యం చేస్తున్న ప్రధాన కార్యదర్శి కె.వెంకటేశ్వర రావు గారు