APTF

APTF
  • Home
  • Sitemap
  • search

WEB LINKS 1

CFMS
E-SR
CHILD INFO
CSE AP
AP SCERT
CPS
MDM
EHS
ZPPF SLIPS
APGLI

WEB LINKS 2

DIKSHA
INCOME TAX
DSC LISTS
TRANSFERS 2022
Home » Semua Post Kategori APTF KRN
Showing posts with label APTF KRN. Show all posts
Showing posts with label APTF KRN. Show all posts

NEP 2020 , రాష్ట్రం అనుసరిస్తున్న విద్యా వ్యతిరేఖ విధానాలను నిరసిస్తూ APSEC ఆధ్వర్యంలో నిరసన : నంద్యాల

Mohan
APTF Updated at: April 09, 2022

 జాతీయ విద్యా విధానం (యన్.ఈ.పీ.) 2020 ని, రాష్ట్రం అనుసరిస్తున్న విద్యా వ్యతిరేఖ విధానాలను నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట శనివారం నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏ.పీ.టీ.ఎఫ్.1938. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె.సాంబశివుడు, జిల్లా అదనపు కార్యదర్శి నగిరి.శ్రీనివాసులు మాట్లాడుతూ యన్.ఈ.పీ.అమలు లో బాగంగా ప్రాథమిక పాఠశాలలను విడదీసి 3.4.5.తరగతులను 3. కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉన్నత పాఠశాలలో విలీనం చేయడం వల్ల విద్యార్థులు అంతదూరం వెళ్ళలేక డ్రాపౌట్సు గా మారే ప్రమాదం ఉందని కాబట్టి దీనికి సంబంధించిన జి.ఒ.నెంబర్ 85   ను అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ప్రాథమిక పాఠశాలలను బలహీన పరుస్తూ 4674 సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులను రద్దు చేస్తూ ప్రభుత్వం విడుదల చేసిన జి.ఒ.నెంబర్  37 ను వెంటనే రద్దు చేయాలని ఉన్నత పాఠశాలలో విధిగా తెలుగు మీడియం ను కొనసాగించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

సీనియర్ నాయకులు యం.పుల్లయ్య, యం.రవి.మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 25 వేల పోస్టులతో డీ.ఎస్సీ.ని ప్రకటించి, భర్తీ చేయాలని, వివిధ రకాల యాప్ లను తొలగించి ఉపాధ్యాయులకు బోధనచేసే స్వేచ్ఛ ను కల్పించాలని, అలాగే రాష్ట్రంలో సి.బి.యస్.ఈ. సిలబస్ ను అమలు చేయవద్దని, రాజ్యాంగ విలువలకు వ్యతిరేకంగా ఉన్న"నూతన జాతీయ విద్యా విధానం 2020" ని  రాష్ట్రం లో అమలు చేయకూడదని వారు డిమాండ్ చేశారు.

విద్యను రాష్ట్ర జాబితాలో చేర్చాలని కోరారు.

కావున ప్రభుత్వం వెంటనే విద్యా పరిరక్షణ కమిటీ ప్రతినిధులతో చర్చించి విద్యా రంగ సమస్యలను పరిష్కరించాలని వారు కోరారు.




ఈ నిరసన కార్యక్రమం లో గోపాల్ రావు, వై.విజయ కుమార్, యస్.వెంకటరమణ, డి.మౌలాలి. మద్దిలేటి,. రాంప్రసాద్,.యన్.రమణ., బత్తుల రవి కుమార్, యం.పవన్., కృష్ణమూర్తి., AISF సీటీ కన్వీనర్ మనోహర్ తదితరులు పాల్గొన్నారు.



సీనియారిటీని ప్రమోషన్ పోస్ట్ లో చేరిన తేదీ కాకుండా ప్రమోషన్ తీసుకున్న తేదీ నుంచే.....

సీనియారిటీని ప్రమోషన్ పోస్ట్ లో చేరిన తేదీ కాకుండా ప్రమోషన్ తీసుకున్న తేదీ నుంచే.....

Mohan
APTF Updated at: November 19, 2021

APTF:1938 KNL INFO:

 13.10.2021 న APTF జిల్లా గౌరవఅధ్యక్షులు ఏ.కమలాకర రావు అద్వర్యంలో పాఠశాల సహాయకుల సీనియారిటీ ని ప్రమోషన్ పోస్ట్ లో చేరిన తేదీ కాకుండా ప్రమోషన్ తీసుకున్న తేది పరిగణనలోకి తీసుకోవాలని ఏ.పి.టి.ఎఫ్. రాష్ట్ర అధ్యక్షుడు జి.హృదయరాజు ప్రాతినిధ్యం చేయడం వల్ల పాఠశాల విద్యా డైరెక్టర్ గారు ప్రొసీడింగ్ నంబర్ 13/37/2021 ఈ.స్.టి.-3; తేదీ 01/10/2021 ద్వారా పాఠశాల సహాయకుల సీనియారిటీని ప్రమోషన్ పోస్ట్ లో చేరిన తేదీ కాకుండా ప్రమోషన్ తీసుకున్న తేది పరిగణనలోకి తీసుకోవాలని ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఈ ఉత్తర్వులను అనుసరించి జిల్లా విద్యాశాఖ అధికారిని ప్రొసీడింగ్ ఇవ్వవలసినది కోరడం జరిగినది. జిల్లా విద్యాశాఖ అధికారిగారు ఉత్తర్వులు ఇస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిలర్ పెద్దస్వామి, జిల్లా కౌన్సిలర్ సూరిబాబు , అలీ తదితరులు పాల్గొన్నారు.

ఆ మేరకు DEO గారు కమ్యునికేషన్ ఉత్తర్వు జారీ చేయడం జరిగింది.
- జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు: బి.మాధవ స్వామి, యస్.ఇస్మాయిల్, APTF

కర్నూలు జిల్లా విద్యాశాఖ అధికారిగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన గౌరవ డీఈఓ శ్రీ రంగారెడ్డి గారిని కలిసి శుభాకాంక్షలు తెలిపిన ఏపిటిఎఫ్

Mohan
APTF Updated at: September 27, 2021

 APTF KNL: 

కర్నూలు జిల్లా విద్యాశాఖ అధికారిగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన గౌరవ డీఈఓ శ్రీ రంగారెడ్డి గారిని , డోన్ ఉప విద్యాధికారి శ్రీ షంషుద్దీన్ గారిని మరియు  అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీ పాల్ గారిని కలిసి శుభాకాంక్షలు తెలిపిన ఏపిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జి.హృదయరాజు, జిల్లా గౌరవ అధ్యక్షులు  ఏ. కమలాకర్ రావు, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బి. మాధవ స్వామి, ఎస్. ఇస్మాయిల్ ఏపిటిఎఫ్ నాయకులు మరి యానందం, రామకృష్ణయ్య, శేషాచలం ,స్వామినాథ మ్, శ్రీ రాములు, లాన్సి నాగభూషణం, రామ్మోహన్, గఫార్, మద్దిలేటి, పెద్ద స్వామి, తిమ్మప్ప,శ్రీనివాస రెడ్డి, రాఘవరెడ్డి, నరేంద్ర , హబీబుల్లా, లింగేశ్వర రెడ్డి, శేషశయనారెడ్డి, సురేష్ , సుబ్బరాయుడు,బనగానపల్లి బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు దస్తగిరి తదితరులు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు.



కర్నూలు జిల్లా నూతన డి ఈ ఓ శ్రీ. డా.రంగారెడ్డి గారు


డోన్ డిప్యూటీ డి.ఈ.వో డా. షంశుద్దిన్ గారు


0/0 DEO ఆఫీస్ అసిస్టెంట్ డైరెక్టర్ -1 శ్రీ. పాల్ గారు








సి.పి.యస్ ను రద్దు చేయాలి: APTF

Mohan
APTF Updated at: September 23, 2021



23.9.2021 నంద్యాల: 

సి.పి.యస్ ను రద్దు చేయాలి: ఏ.పీ.టీ.యఫ్
 
ముఖ్యమంత్రి  తన ప్రజా సంకల్ప యాత్ర లో ఇచ్చిన హామీ మేరకు సి.పి.యస్.ను వెంటనే రద్దు చేసి పాత పెన్షన్ పథకాన్ని పునరుద్ధరించాలని ఏ.పీ.టీ.ఎఫ్.1938 రాష్ట్ర అధ్యక్షులు మరియు ఎ.పి.జే.ఏ.సి.సెక్రేటరీ జనరల్ జి.హృదయరాజు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.గురువారం స్థానిక ప్రాంతీయ కార్యాలయం, నంద్యాల లో జిల్లా అదనపు కార్యదర్శి నగిరి.శ్రీనివాసులు అధ్యక్షతన జరిగిన సమావేశంలో హృదయరాజు మాట్లాడుతూ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధ్యాయ , ఉద్యోగులకు రావలసిన పి.ఆర్.సిని డి.ఏ.లను సకాలంలో చెల్లిస్తానని హామీ ఇచ్చారు.ఇచ్చిన హామీ మేరకు పి.అర్.సి. ని పెండింగ్ లో ఉన్న ఐదు  డి.ఏ.లను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.     
           
జిల్లా గౌరవవాధ్యక్షులు ఎ.కమలాకర్ రావు మాట్లాడుతూ ప్రభుత్వ ఉత్తర్వు 302 ను పునరుద్ధరించి అర్హత కలిగిన పాఠశాల సహాయకులకు 40 శాతం జూనియర్ లెక్చరర్స్ గా పదోన్నతులు కల్పించి ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఐ.మరియానందం మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన యాప్ ల భారాన్ని తగ్గించాలని. ఉపాధ్యాయులకు బోధనేతర పనులు అప్పజెప్ప రాదని, వారిని బోధనకే పరిమితం చేసి పేద విద్యార్థులకు గుణాత్మక మైన విద్య అందేటట్లు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె.సాంబశివుడు మరియు డివిజన్ నాయకులు బత్తుల రవి కుమార్,యం.పుల్లయ్య. యం.రవి. రవి ప్రకాష్, కృష్ణమూర్తి,రషీద్, నీలగిరి.వెంకటేశ్వర్లు, మహాబూబ్ బాషా, ఆవుల.మునిస్వామి..యం పవన్.తదితరులు పాల్గొన్నారు.

హెల్త్ కార్డ్ (EHS)వుందని చెప్పినా క్యాష్ లేష్ ట్రీట్మెంట్ ఇవ్వకుండా డబ్బులు కట్టించుకున్న హాస్పిటల్ యాజమాన్యం నుండి రూ 92,000/- రికవరీ చేయించిన APTF:

Mohan
APTF Updated at: June 25, 2021

 APTF:1938 KNL

మొదటి వేవ్ కరోనా సమయంలో స్కూల్ అసిస్టెంట్ & APTF జిల్లా కార్యదర్శి లాన్సీ నాగభూషణం గారు కరోనా చికిత్స నిమిత్తం శ్రీ సాయి సత్య సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, కర్నూలు లో ఉద్యోగుల హెల్త్ కార్డ్ (EHS)వుందని చెప్పినా క్యాష్ లేష్ ట్రీట్మెంట్ ఇవ్వకుండా డబ్బులు కట్టించుకోవడం జరిగింది. 


దీనిపై EHS స్టీరింగ్ కమిటీ లో సభ్యసంఘంగా వున్న APTF:1938 జిల్లా శాఖ జిల్లా EHS కో - ఆర్డినేటర్ & రాష్ట్ర నాయకత్వానికి ప్రాతినిధ్యం చేశారు. రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి.హృదయ రాజు & కె.వెంకటేశ్వర రావు గార్లు నిబంధనలు పాటించని హాస్పిటల్ నుండి రికవరీ చేయాలని వైఎస్సార్ ట్రస్ట్, సీఈఓ గుంటూరు వారికి  ప్రాతినిధ్యం చేయడం జరిగింది. రాష్ట్ర & జిల్లా నాయకత్వం కృషి మేరకు నేడు శ్రీ సాయి సత్య హాస్పిటల్ యాజమాన్యం నుండి రూ 92,000/- రికవరీ అమౌంట్ ను నాగభూషణం గారికి ఇప్పించడం జరిగింది.





ఇట్లు:

జిల్లా గౌరవాధ్యక్షులు: ఏ.కమలాకరరావు, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు: బి.మాధవ స్వామి, యస్.ఇస్మాయిల్, APTF:1938, కర్నూలు జిల్లా


ఇచ్చిన హామీ ప్రకారం సిపిఎస్ విధానం రద్దు చేయాలి - - APTF కర్నూలు జిల్లా శాఖ

ఇచ్చిన హామీ ప్రకారం సిపిఎస్ విధానం రద్దు చేయాలి - - APTF కర్నూలు జిల్లా శాఖ

Mohan
APTF Updated at: May 31, 2021


ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తయినప్పటికీ ఇంతవరకు సిపిఎస్ విధానం రద్దు చేయలేదని, ఇప్పటికైనా ఇచ్చిన హామీ ప్రకారం సిపిఎస్ విధానం రద్దు చేయాలని ఏపిటిఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి.మాధవ స్వామి  ఎస్.ఇస్మాయిల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 

ప్రభుత్వం ఏర్పడక ముందు వై యస్ జగన్ మోహన్ రెడ్డి తన సంకల్ప పాదయాత్రలో ఇచ్చిన హామీ ప్రకారం సిపిఎస్ ను అధికారంలోకి వచ్చిన వారంలో రద్దు చేస్తానని,రెండు సంవత్సరాలైనా ఇంతవరకు  సిపియస్ విధానం రద్దు చేయలేదని అన్నారు. వెంటనే సిపియస్ విధానం రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. అదేవిధంగా ఉపాధ్యాయులను ఫ్రంట్లైన్ వారియర్స్ గా గుర్తించి ఉపాధ్యాయులందరికీ తక్షణమే వ్యాక్సినేషన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. కరోనాతో మరణించిన ఉపాధ్యాయుల కుటుంబాలను వారి పిల్లలను ఆదుకోవాలని కోరారు. 

ఇట్లు బి .మాధవ స్వామి, 
జిల్లా అధ్యక్షులు, ఏపిటిఎఫ్

కర్నూలు జిల్లా, లక్ష్మీపురం వీవింగ్ ఇన్స్ట్రక్టర్, APTF కార్యకర్త, ఆప్తుడు శ్రీ ఖుర్శిద్ హుస్సేన్ గారిని సన్మానిస్తున్న రాష్ట్ర అధ్యక్షులు హృదయరాజు

Mohan
APTF Updated at: May 01, 2021

నేడు (30.4.21) పదవీ విరమణ పొందిన జి.ప.ఉన్నత పాఠశాల, లక్ష్మీపురం, కర్నూలు జిల్లా వీవింగ్  ఇన్స్ట్రక్టర్, APTF కార్యకర్త, ఆప్తుడు శ్రీ ఖుర్శిద్ హుస్సేన్ గారిని APTF ఆధ్వర్యంలో సన్మానిస్తున్న జి.ప.ఉ.పాఠశాల, ఆర్ ఎస్ రంగాపురం ప్రధానోపాధ్యాయులు శ్రీ వై.ప్రభాకర్, APTF రాష్ట్ర అధ్యక్షులు జి.హృదయరాజు, జి.ప.ఉ. పాఠశాల ఏనుగుమర్రి ఫిజికల్ డైరెక్టర్ శ్రీ. కె.పాల్ విజయ కుమార్.

కర్నూల్ : ఏపీటీఎఫ్ సభ్యత్వ నమోదు కార్యక్రమం

Mohan
APTF Updated at: March 31, 2021


కర్నూల్ : ఏపీటీఎఫ్ సభ్యత్వ నమోదు కార్యక్రమం కొత్త మండలం సంజామల కర్నూలు  జిల్లా అధ్యక్షులు మాధవ స్వామి, రామాంజనేయులు, పరమేశ్వరుడు, పరమేశ్వర్ రెడ్డి Hm శ్రీ రాములు తదితరులు.




APTF KURNOOL MEMBERSHIP CAMPAIN IN PAGIDYALA MANDAL


ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలి! ఏపిటిఎఫ్

Mohan
APTF Updated at: March 23, 2021



"ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలి "ఏపీటీఎఫ్."రాష్ట్రంలో వివిధ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న  25 వేల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, భర్తీ చేసేంతవరకు ఖాళీగా ఉన్న పోస్టులకు విద్యావలంటీర్లను నియమించాల ని ఏపిటిఎఫ్ జిల్లా గౌరవ అధ్యక్షులు కమలాకర్ రావు, జిల్లా అధ్యక్షులు బి.మాధవ స్వామి లు డిమాండ్ చేశారు. బనగానపల్లె మండలం లో సభ్యత్వ నమోదు కార్యక్రమం లో పాల్గొని మాట్లాడడం జరిగింది. రేషనలైజేషన్ ద్వారా అనేక పాఠశాలలు ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మిగిలిపోయాయని అలాగే ఉన్నత పాఠశాలలో అనేక స్కూల్ అసిస్టెంట్లు ఖాళీలు ఏర్పడ్డాయని వెంటనే వాటిని భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా ప్రధానోపాధ్యాయులకు , ఉపాధ్యాయులకు యాప్  ల భారాన్ని తగ్గించాలని అధికారులను కోరారు. అనేక పాఠశాలల్లో క్యాడర్ స్ట్రెంత్ లో లో సమస్యలు ఏర్పడి ఉపాధ్యాయులకు మూడు నెలలైనా జీతాలు అందక అవస్థలు పడుతున్నారని ఆ సమస్యను వెంటనే పరిష్క రించి జీతాలు అందే విధంగా చూడాలని అధికారులను కోరారు. సభ్యత్వ నమోదు కార్యక్రమం లో పాల్గొన్న ఉపాధ్యాయులు మధుసూదన్ రావు, గోపాల్ రావు ,నాగరాజు, లింగ మయ్య, రామకృష్ణ,అనిల్ కుమార్  ,వెంకటకృష్ణ, సుబ్బరాయుడు ,బ్రహ్మయ్య, య, మద్దిలేటి బాలాజీ నాయక్ యుగంధర్ తదితరులు పాల్గొన్నారు

APTF కర్నూల్ జిల్లా ఏపీటీఎఫ్ కార్యకర్తకు అరుదైన గౌరవం.

Mohan
APTF Updated at: February 25, 2021

 గడివేముల మండల ప్రధానకార్యదర్శి ఏ.రవికుమార్  బదిలీపై వెళ్లిన సందర్భంగా ఆయన  వృత్తి నిబద్దత కి గ్రామస్థులు చేసిన గౌరవం మరియు సన్మానానికి  రాష్ట్ర స్థాయిలో నేడు సాక్షి పేపర్లో ప్రచురణ. రనికుమార్ గారు APTF మండల ప్రధానకార్యదర్శిగా ఉంది APTF లక్ష్యాల్లో ఒకటైన వృత్తి నిబద్ధతతో  ఉపాద్యాయులకి ఆదర్శంగా నిలిచారు. APTF కర్నూల్ జిల్లా శాఖ పక్షాన ప్రత్యేక అభినందనలు.




హథ్రాస్ దళిత బాలిక మనీషా హత్యాచార నిందితులను కటినంగా శిక్షించాలి: ఏపిటీఎఫ్

Mohan
APTF Updated at: October 09, 2020

 ఇటీవల ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో హథ్రాస్ లో దళిత బాలిక మనీషా వాల్మీకి ని మూకుమ్మడిగా హత్యాచారం చేసిన దుండగులను కఠీనంగ శిక్షించాలని ఏపిటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జి.హృదయ రాజు డిమాండ్ చేశారు.

APTF ఫెడరేషన్ పిలుపు మేరకు మనీషా పై , దేశం, రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కర్నూలు కలెక్టరేట్ వద్ద గాంధీ విగ్రహం ముందు జిల్లా గౌరవాధ్యక్షులు, జిల్లా ప్రధాన కార్యదర్శులు ఏ.కమలాకర రావు అధ్యక్షతన కొవ్వుతులతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర అధ్యక్షుడు జి.హృదయ రాజు మాట్లాడుతూ హథ్రాస్ దళిత బాలిక మనీషా పై మూకుమ్మడి అత్యాచారం చేయడం, అర్ధరాత్రి కననం చేయడం, సాక్ష్యాలు కనుమరుగు చేయడం అత్యంత దారుణమని అన్నారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ తీరు చూస్తే మహిళల రక్షణ పట్ల పూర్తి నిర్లక్షం వహిస్తుందన్నారు. దేశంలో అనేక మహిళలపై అఘాయిత్యాలు రోజురోజుకి పెచ్చరిల్లిపోతున్నాయని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. 


APTF మహిళ ప్రతినిధి శ్రీమతి.విజయలక్ష్మి మాట్లాడుతూ మహిళలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను అయా ప్రభుత్వాలు హరించివేయడం, మహిళలపై అత్యాచారాలను చేస్తున్న వారిపై చర్యలు తీసుకో కుండ,మహిళలను స్వేచ్ఛను హరిస్తూ ఇంటికి పరిమితం చేయాలని మాట్లాడడం మహిళల పట్ల వారికున్న గౌరవం అర్థమౌతుందన్నారు. 





జిల్లా ప్రధాన కార్యదర్శి యస్. ఇస్మాయిల్ మాట్లాడుతూ సామాజిక భాద్యతగా APTF మహిళలు, బాలికల రక్షణ కోసం మరియు అత్యాచారాలు చేసిన వారిని తీవ్రంగా శిక్షించుటకు ఎంతటి ఆందోళన కార్యక్రమాలనైనా APTF చేస్తుందని అన్నారు. కొవ్వొత్తుల నిరసన ప్రదర్శనలో జిల్లా ఉపాధ్యక్షుడు కె.జనార్ధన్ రెడ్డి, రాష్ట్ర కౌన్సిలర్స్ గఫార్, కె.మద్దిలేటి, పుల్లారెడ్డి, శ్రీనివాస రెడ్డి, మండల నాయకులు హాబిబుల్ల, సురేష్, నాగేంద్ర , మల్లికార్జున, శేషు తదితరులు పాల్గొన్నారు.




- యస్.ఇస్మాయిల్, జిల్లా ప్రధాన కార్యదర్శి, APTF, కర్నూలు జిల్లా

ఉపాధ్యాయుల కు హెల్త్ కార్డ్స్ కు వైద్యం నిరాకరించి వసూలు చేసిన డబ్బులు వెంటనే వెనక్కి చెల్లించాలి:APTF

Mohan
APTF Updated at: September 17, 2020

 ప్రస్తుత కోవిడ్ పరిస్థితులలో కోవిడ్ positive గా నిర్ధారించిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు మరియు పెన్షనర్లకు ఎంప్లాయ్ హెల్త్ స్కీం (EHS) ద్వారా ఉచిత వైద్యం అందించాలని ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నప్పటికి జిల్లాలో కొన్ని కార్పొరేట్ ఆసుపత్రులు హెల్త్ కార్డ్స్ కింద వైద్యం నిరాకరించి డబ్బును వసూలు చేస్తున్నారని APTF రాష్ట్ర ప్రధాన కార్యదర్శి &  రాష్ర్ట EHS స్టీరింగ్ కమిటీ సభ్యులు జి. హృదయరాజు, APTF జిల్లా గౌరవాధ్యక్షులు ఏ.కమలాకర రావు, ప్రధాన కార్యదర్శి ఎస్.ఇస్మాయిల్, సహద్యక్షులు కె.శేఖర్ లు EHS కర్నూలు జిల్లా కో ఆర్డినేటర్ గారికి ప్రాతినిధ్యం చేయడం జరిగింది. జిల్లాలోని AMILEO హాస్పిటల్ మరియు MEDICOVER ఆసుపత్రులలో ఇటీవల కాలంలో కోవిడ్ positive గా నిర్ధారించిన ఒక ఉపాద్యాయుడు మరియు పెన్షనర్ కి EHS క్రింద వైద్యం నిరాకరించి ఒకరి దగ్గర నాలుగు లక్షల అరవై వేల రూపాయలు ఇంకొకరి దగ్గర 3.6 లక్షల రూపాయలు అక్రమంగా వసూలు చేసారని, ఇటువంటి సంఘనలు జిల్లాలో చాలా ఉన్నాయని వాటిని వెంటనే వెనక్కి చెల్లించేలా ఆసుపత్రు లపై చర్యలు తీసుకోవాలని వీరు తెలిపారు.దీనిపై EHS జిల్లా కో ఆర్డినేటర్ ప్రవీణ్ గారు తక్షణమే స్పందించి ఆసుపత్రులపై చర్యలు తీసుకుంటానన్నారు.అదే విధంగా జిల్లా లోని ఆసుపత్రులలో ఎక్కడైనా హెల్త్ కార్డ్స్ ద్వారా  వైద్యం నిరాకరిస్తే తక్షణమే 104 కి గాని కో ఆర్డినేటర్ దృష్టికి తీసుకొని రావాలన్నారు. ఐతే ఆసుపత్రుల యాజమాన్యాలు , EHS సిబ్బంది సమస్యలపై స్పందించనిచో రాష్ట్ర CEO గారి దృష్టికి తీసుకెళ్తామని APTF నాయకులు అన్నారు.








కర్నూలు జిల్లా కొత్త డి.యి.ఒ శ్రీ సాయిరాం గారికి అభినందనలు తెలిపిన ఎపిటిఎఫ్ శ్రేణులు

Mohan
APTF Updated at: October 13, 2019

Greeting  to new DEO sri SAI RAM Garu by APTF Dist unit members

ఉపాద్యాయులకు బదిలీలు చేపట్టాలి : ఏపీటీఎఫ్ వినతి

Mohan
APTF Updated at: July 02, 2019



నేడు (1.7.19) విద్యాశాఖ మంత్రి    శ్రీ ఆదిమూలపు సురేష్ గారు  కర్నూలుకు వచ్చిన సందర్భంగా ఉపాధ్యాయ బదిలీల షెడ్యూల్ విడుదల చేయాలని కోరుతూ ఏపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.హృదయ రాజు గారి ఆధ్వర్యంలో మెమోరాండం ఇచ్చిన APTF కార్యకర్తలు,ఉపాధ్యాయులు.

అక్టోబర్ 23 న తలపెట్టిన ఛలో రాజ్ భవన్ అనుబంధంగా ఛలో గుంటూరు పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం : కర్నూలు

Mohan
APTF Updated at: October 10, 2018

ఏపీటీఎఫ్: సిపియస్ రద్దు , కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలనే డిమాండ్స్ పై అక్టోబర్ 23 న తలపెట్టిన ఛలో రాజ్ భవన్ అనుబంధంగా ఛలో గుంటూరు పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం కర్నూలు కలెక్టరేట్ లో జరిగింది. ఏపీజేఏసీ జిల్లా చైర్మన్ వి.సిహెచ్. వెంగళరెడ్డి అధ్యక్షత వహించగా ఏపీటీఎఫ్ రాష్ట్ర ప్ర.కా: జి.హృదయరాజు, జిల్లా గౌరవాధ్యక్షులు ఏ.కమలాకర్ రావు,జిల్లా ప్రధాన కార్యదర్శి టి.వి.రామకృష్ణయ్య, జేఏసీ సెక్రటరీ జనరల్ జవహర్ తదితరులు పాల్గొన్నారు.కర్నూలు జిల్లా నుండి 5వేల మంది ఛలో గుంటూరు కార్యక్రమానికి వెళ్లాలని నిర్ణయించడం జరిగింది
------------------------------------------------




APTF membership campaign in ZPHS velgode. KURNOOL District.

Mohan
APTF Updated at: December 23, 2017


కర్నూలు జిల్లా నూతన డి.ఈ.ఓ గా నియమితులైన శ్రీమతి తెహరా సుల్తానా గారిని ఈ రోజు ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో కలిసి అభినందనలు

కర్నూలు జిల్లా నూతన డి.ఈ.ఓ గా నియమితులైన శ్రీమతి తెహరా సుల్తానా గారిని ఈ రోజు ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో కలిసి అభినందనలు

Mohan
APTF Updated at: December 18, 2017

*ఏపీటీఎఫ్:*  కర్నూలు
కర్నూలు జిల్లా నూతన డి.ఈ.ఓ గా నియమితులైన శ్రీమతి తెహరా సుల్తానా గారిని ఈ రోజు ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో కలిసి అభినందనలు తెలియజేయడం జరిగింది.

ఈ సంధర్భంగా జిల్లాలో గత కొన్ని సంవత్సరాలుగా పెండింగులో ఉన్న SGT, SA's క్రమబద్దీకరణలు చేయాలనీ, ఎయిడెడ్ టీచర్స్ కు 010 హెడ్ పై జీతాల మంజూరుకు HRMS లో వివరాల నమోదుకై తగు చర్యలు తీసుకోవాలని, బదిలీ కాబడి రిలీవ్ కానీ వారిని వెంటనే రిలీవ్ చేయాలని తదితర సమస్యలను DEO గారి దృష్టికి తేవడం జరిగింది.DEO సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు 
జి.హృదయరాజు, రాష్ట్ర కార్యదర్శి ఏ.కమలాకరరావు,ఈసీ మెంబర్ రామ్మోహన్, రాష్ట్ర కౌన్సిలర్స్ కె.మద్దిలేటి, రాఘవరెడ్డి, పుల్లారెడ్డి,రామకృష్ణ,శ్రీనివాసులు జిల్లా నాయకులు కె.శేఖర్, VC తిమ్మప్ప, కర్నూలు, ఓర్వకల్, కల్లూరు నాయకులు సూరిబాబు, శేషయ్య, సురేష్,శ్రీనాథ్,శివరాం,విజయభాస్కర్, ప్రభావతి మేడం తదితరులు పాల్గొన్నారు.
- ఏపీటీఎఫ్

Older Posts
Subscribe to: Comments (Atom)

EXAMS

APPSC
SSC
NMMS
NTSE
HM ACT TEST
PAT
D.El.Ed
LPT
TCC
TTC
AP OPEN SCHOOL

deo websites

SRIKAKULAM
Vizianagaram
VISAKHA
W.GODAVARI
E.GODAVARI
KRISHNA
GUNTUR
PRAKASAM
NELLORE
CHITTOOR
KURNOOL
KADAPA
ANATHAPURAM

Total Pageviews

Copyright © - APTF |